25వేల కేసులు పరిష్కారం
ABN, Publish Date - Dec 31 , 2023 | 12:12 AM
జాతీయ లోక్ అదాలత్లో వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో వికారాబాద్, కొడంగల్, పరిగి, తాండూర్ కోర్టుల్లో మొత్తం 25వేల కేసులు రాజీపడినట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి కె.సుదర్శన్ అన్నారు.
వికారాబాద్, డిసెంబరు 30: జాతీయ లోక్ అదాలత్లో వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో వికారాబాద్, కొడంగల్, పరిగి, తాండూర్ కోర్టుల్లో మొత్తం 25వేల కేసులు రాజీపడినట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి కె.సుదర్శన్ అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ మెగాలోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి డీబీ శీతల్, ప్రిన్సిపాల్ జూనియర్ జడ్జి కె.శ్రీకాంత్, అదనపు న్యాయాధికారి శ్రుతి దూత, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ , అన్వే్షసింగ్, సమీన బేగం, వికారాబాద్ బార్వైస్ ప్రెసిడెంట్ శంకరయ్య, గోవర్దన్రెడ్డి, సంపూర్ణఆనంద్, యాదవ్రెడ్డి, కమల్రెడి,్డ బస్వరాజ్పటేల్, మాధవ్రెడ్డి, నాగరాజు, శ్రీనివాసరావు, న్యాయవాదులు వికారాబాద్ జిల్లా పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
పరిగి: కేసుల్లోని ఇరు పక్షాలు రాజీపడితే లోక్అదాలత్లో కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని పరిగి మున్సిఫ్ కోర్టు న్యాయాధికారి కె.జనార్ధన్ అన్నారు. పరిగి కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహించి కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయాధికారి మాట్లాడుతూ.. కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృథా చేసుకోరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీపీవో దీపారాణి, ఏజీపీ బి.వెంకట్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాంచందర్, కె.శ్రీశైలం, న్యాయవాదులు నర్సింహారావు పాల్గొన్నారు.
లోక్ అదాలత్లో 4215 కేసుల పరిష్కారం
తాండూరు: తాండూరు కోర్టులో శనివారం మెజిస్ర్టేట్లు శివలీల, నామాల అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 4215 కేసులు పరిష్కరించారు. కొన్ని కేసులకు సంబంధించి రూ.3లక్షల 53వేల 190 జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు శ్రీనివా్సరెడ్డి, పాశం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 31 , 2023 | 12:12 AM