అందుబాటులో ఉంటూ సేవకుడిలా పనిచేస్తా..
ABN, First Publish Date - 2023-12-10T23:49:28+05:30
ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకుడిగా పనిచేస్తా నని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు.
ధర్మారం, డిసెంబరు 10: ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకుడిగా పనిచేస్తా నని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని పత్తిపాక ఎక్స్రోడ్డు వద్ద ఆయనకు పెద్దఎత్తున ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ బైకు ర్యాతీతో ధర్మారానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమా ర్ను నాయకులు గజమాలతో సన్మానించారు. ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6గ్యారంటీ పథకాలలో రెండు పథకాలను అమలుచేస్తోందని చెప్పారు. ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం రేవంత్రెడ్డిని కలిసి నియోజకవర్గంలోగల పలు సమస్యలను విన్నవించినట్టు ఆయన తెలిపారు. ప్రభు త్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజలకు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కొడారి హన్మయ్య, నాయకులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, చింతల ప్రదీప్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, కొత్త నర్సింహులు, కాంపెల్లి రాజేశం, బొల్లి స్వామి, దేవి జనార్దన్, తాళ్లపల్లి లింగయ్య, పాలకుర్తి రేణుకరాజేశం, దేవి లావణ్య, సోగాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-10T23:49:35+05:30 IST