Kumaram Bheem Asifabad: విద్యావిధానంపై ప్రత్యేకంగా మానిటరింగ్ చేయాలి: డీఈవో
ABN, First Publish Date - 2023-12-04T22:31:07+05:30
ఆసిఫాబాద్ రూరల్, డిసెంబరు 4: ప్రధానోపాధ్యాయులు, మండలనోడల్ అధికా రులు, మండలవిద్యాధికారులు విద్యావిధానంపై ప్రత్యేకంగా మానిటరింగ్ చేయా లని జిల్లా విద్యాధికారి అశోక్, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలో ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధానోపా ధ్యాయులు, మండల నోడల్ అధికారులు, ఎంఈవోలకు తొలిమెట్టు, ఉన్నతి, లక్ష్య కార్యక్రమాల అమలు గురించి సమావేశం నిర్వహించారు.
- డీఈవో అశోక్
ఆసిఫాబాద్ రూరల్, డిసెంబరు 4: ప్రధానోపాధ్యాయులు, మండలనోడల్ అధికా రులు, మండలవిద్యాధికారులు విద్యావిధానంపై ప్రత్యేకంగా మానిటరింగ్ చేయా లని జిల్లా విద్యాధికారి అశోక్, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలో ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధానోపా ధ్యాయులు, మండల నోడల్ అధికారులు, ఎంఈవోలకు తొలిమెట్టు, ఉన్నతి, లక్ష్య కార్యక్రమాల అమలు గురించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలిమెట్టులో ఆరు, ఉన్నతిలో భాగంగా ఎనిమిది అంశాలను నిశి తంగా పరిశీలించాలని అన్నారు. పదవ తరగతి విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించడం గురించి ఉద్దేశించిన లక్ష్య కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. డిసెంబరు చివరి కల్లా సిలబస్ పూర్తి చేయాలన్నారు. మానిటరింగ్ చేసిన తరువాత స్కూల్ ఎడ్యూకేషన్ యాప్లో తప్పనిసరిగా వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ప్రతినెల మూడో శనివారం పేరెంట్స్, టీచర్ మీటింగ్ నిర్వహించాలన్నారు. ఇంటింటా చదువుల పంటలో ప్రతి విద్యార్థి రిజిస్టర్ అయ్యేలా చూడాలన్నారు.
Updated Date - 2023-12-04T22:31:08+05:30 IST