ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: హిందూ జాతరలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదు...

ABN, First Publish Date - 2023-01-22T15:53:52+05:30

హిందువుగా పుట్టడం అదృష్టం, హిందువుగా జన్మించడం పూర్వ జన్మ సుకృతమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్: హిందువుగా పుట్టడం అదృష్టం... హిందువుగా జన్మించడం పూర్వ జన్మ సుకృతమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఆధివారం కేస్లాపూర్ నాగోబా జాతర (Nagoba Jatara) సభలో ఆయన మాట్లాడుతూ హిందూ జాతరలను సీఎం కేసీఆర్ (CM KCR) పట్టించు కోవడం లేదని, నిజాం వారసుల మృతదేహాలను స్వాగతిస్తున్నారని విమర్శించారు. సెలబ్రిటీలు చనిపోతే వెళతారని... కానీ గిరిజన ప్రాంతాల్లో పర్యటించరని, పోడు భూములకు పట్టాలివ్వలేదని ఆరోపించారు. కుర్చేసుకుని పట్టాలిస్తా అన్నారని... ఇప్పుడు అటవీశాఖ అధికారులను పంపి కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీల డబ్బులను కాజేశారని, ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ దివాళ తీసిన కంపెనీ అని, అందుకే బీఆర్ఎస్‌గా మార్చారన్నారు. ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము (Draupadi Murmu)ను ఓడగొట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాని ప్రజలను కోరారు. అధికారంలోకి వచ్చాక అన్ని జాతరలను ఘనంగా నిర్వహిస్తామని, పేదలందరికి ఉచిత విద్య, వైద్యం అందించడంతో పాటు పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-01-22T15:53:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising