ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WPL 2023: చివరి మ్యాచ్‌లోనూ చేతులెత్తేసిన బెంగళూరు.. ముంబై ఎదుట స్వల్ప లక్ష్యం

ABN, First Publish Date - 2023-03-21T17:19:11+05:30

మహిళల ప్రీమియర్ లీగ్(WPL) చివరి మ్యాచ్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు చేతులెత్తేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(WPL) చివరి మ్యాచ్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు చేతులెత్తేసింది. ముంబై(Mumbai Indians)తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు షరా మామూలుగానే ఆడింది. మ్యాచ్‌లో ఎలాంటి మెరుపులు కనిపించలేదు. ముంబై బౌలర్ల ముందు వీరి ఆటలు సాగలేదు. వరుస వికెట్లు తీస్తూ బెంగళూరు(RCBW)ను కోలుకోలేకుండా చేశారు. ఫలితంగా ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్ చేరారు. ఎల్లిస్ పెర్రీ, రిచా ఘోష్ చెరో 29 పరుగులు చేశారు. కెప్టెన్ స్మృతి మంధాన 24 పరుగులు చేసింది. హెదర్ నైట్, కనిక అహుజ చెరో 12 పరుగులు చేశారు. ముంబై(MIW) బౌలర్లలో అమెలియా కెర్ 3 వికెట్లు తీసుకోగా, నట్ స్కివర్ బ్రంట్, ఇసీ వోంగ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Updated Date - 2023-03-21T17:20:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising