ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అశ్విని జోడీదే ట్రోఫీ

ABN, First Publish Date - 2023-12-11T04:46:41+05:30

గువాహటి మాస్టర్స్‌ సూపర్‌-100 బ్యాడ్మింటన్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ను అశ్వినీ పొన్నప్ప-తనీషా క్యాస్ట్రో జోడీ సొంతం చేసుకొంది. ఆదివారం జరిగిన ఫైనల్లో...

గువాహటి: గువాహటి మాస్టర్స్‌ సూపర్‌-100 బ్యాడ్మింటన్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ను అశ్వినీ పొన్నప్ప-తనీషా క్యాస్ట్రో జోడీ సొంతం చేసుకొంది. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్‌ అశ్విని-తనీషా జంట 21-13, 21-19తో చైనీస్‌ తైపీకి చెందిన సంగ్‌ షు యున్‌-యు చెన్‌ హుపై వరుస గేముల్లో నెగ్గి విజేతగా నిలిచింది. అబుదాబి మాస్టర్స్‌, నాన్‌టె్‌స ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ తర్వాత ఈ జోడీకిది మూడో టైటిల్‌. మహిళల సింగిల్స్‌లో చైవాన్‌ లనిన్‌రాట్‌ (థాయ్‌లాండ్‌) 21-14, 17-21, 21-16తో లిన్‌ క్రిస్టోఫర్‌సెన్‌ (డెన్మార్క్‌)పై, ఇద్దరు ఇండోనేసియా ఆటగాళ్ల మధ్య జరిగిన పురుషుల ఫైనల్లో యోహానెస్‌ సౌట్‌ మార్సెల్లీ 21-12, 21-17తో అల్వి విజయ చైరుల్లాపై గెలిచి చాంపియన్లుగా నిలిచారు.

Updated Date - 2023-12-11T04:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising