ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai: సేలం నుంచి షిర్డీ వరకు.. 82 ఏళ్ల వయస్సులోనూ..

ABN, First Publish Date - 2023-03-30T12:14:55+05:30

సేలంకు చెందిన సాయిబాబా భక్తుడు కనక సభాపతి(82) మౌంటైన్‌ ట్రైనింగ్‌ క్లబ్‌ నిర్వాహకుడు. 30 ఏళ్లుగా తన కార్యకలాపాలకు సైకిల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెరంబూర్‌(చెన్నై): సేలంకు చెందిన సాయిబాబా భక్తుడు కనక సభాపతి(82) మౌంటైన్‌ ట్రైనింగ్‌ క్లబ్‌ నిర్వాహకుడు. 30 ఏళ్లుగా తన కార్యకలాపాలకు సైకిల్‌ వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన సేలం నుంచి షిర్డీ(Salem to Shirdi)కి సైకిల్‌పై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 16వ తేది సైకిల్‌ యాత్ర ప్రారంభించిన కనక సభాపతి, పలు రాష్ట్రాల మీదుగా ఈ నెల 22వ తేది షిర్డీ చేరుకున్నారు. ఈ యాత్రలో ఆయన 1,207 కి.మీ సైకిల్‌ ప్రయాణం చేశారు. తన యాత్ర పూర్తిచేసుకొని మంగళవారం స్వగ్రామానికి చేరుకున్న ఆయనకు పట్టణ ప్రముఖులు, పలు సంఘాల నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కనక సభాపతి మాట్లాడుతూ... సైకిల్‌ తొక్కితే ఆరోగ్యంతో పాటు మనస్సుకు ప్రశాంతత చేకూరుతుందన్నారు. ప్రస్తుతం సైకిల్‌ వినియోగం అధికం కావడం శుభపరిణామమని, ఆరోగ్యవంతమైన జీవితానికి సైక్లింగ్‌ ముఖ్యమని కనక సభాపతి తెలిపారు.

Updated Date - 2023-03-30T12:14:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising