బతికి ఉండగా వారి ప్రేమను అంగీకరించలేదు.. చివరకు వారి విగ్రహాలకు పెళ్లి చేశారు..!
ABN, First Publish Date - 2023-01-18T20:22:24+05:30
గుజరాత్లోని (Gujarat News) థాపీ ప్రాంతంలో ఓ విచిత్రం వివాహం జరిగింది.. రెండు విగ్రహాలకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘనంగా వివాహం జరిపించారు.. ఆ ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుని పెద్దలు అంగీకరించకపోవడంతో ఆరు నెలల క్రితం ఆత్మహత్యలు చేసుకున్నారు..
గుజరాత్లోని (Gujarat News) థాపీ ప్రాంతంలో ఓ విచిత్రం వివాహం జరిగింది.. రెండు విగ్రహాలకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘనంగా వివాహం జరిపించారు.. ఆ ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుని పెద్దలు అంగీకరించకపోవడంతో ఆరు నెలల క్రితం ఆత్మహత్యలు చేసుకున్నారు.. ఆలస్యంగా మేల్కొన్న పెద్దలు తమ తప్పును సరిదిద్దుకునేందుకు వారి విగ్రహాలను నెలకొల్పి వాటికి వివాహం చేశారు (Statues Marriage).
థాపీ ప్రాంతంలో నివసిస్తున్న గణేష్, రంజన అనే ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పి వారిని ఒప్పించేందుకు ప్రయత్నం చేశారు. అయితే, వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇక తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని నిర్ధారణకు వచ్చిన ప్రేమికులిద్దరూ గతేడాది ఆగస్టు నెలలో ఆత్మహత్య చేసుకున్నారు (Lovers Suicide). ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. వారి మృతితో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారిలో పశ్ఛాత్తాపం మొదలైంది.
ఇరు కుటుంబాల వారు తమ తప్పుతెలుసుకుని ఓ నిర్ణయం తీసుకున్నారు. రెండు కుటుంబాలు వారు కలిసి గణేష్, రంజన విగ్రహలను స్థానిక బస్టాండ్ సమీపంలో ప్రతిష్టించారు. ఈ జంట ఆత్మహత్య చేసుకున్న ఆరు నెలల తర్వాత వారి కుటుంబ పెద్దలు సంప్రదాయబద్ధంగా విగ్రహాలకు వివాహం జరిపించారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారి కోరికలు తీర్చేందుకే ఇలా చేశామని కుటుంబ సభ్యులు తెలిపారు.
Updated Date - 2023-01-18T20:22:26+05:30 IST