ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: ‘వీధి అరుగు’ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా శకపురుషుని శతవసంతాలు వేడుకలు

ABN, First Publish Date - 2023-05-28T22:09:02+05:30

"వీధి అరుగు, నార్వే" ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 100కి పైగా తెలుగు సాహిత్య సాంస్కతిక సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కీ.శే. నందమూరి తారకరామారావు శతవసంతోత్సవాల్లో ఎన్టీఆర్‌ను ఒక ప్రత్యేకమైన రీతిలో గుర్తుచేసుకునే విధంగా అపూర్వంగా 2023 మే 27న జరిగాయి.

"వీధి అరుగు, నార్వే" ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 100కి పైగా తెలుగు సాహిత్య సాంస్కతిక సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కీ.శే. నందమూరి తారకరామారావు శతవసంతోత్సవాల్లో ఎన్టీఆర్‌ను ఒక ప్రత్యేకమైన రీతిలో గుర్తుచేసుకునే విధంగా అపూర్వంగా 2023 మే 27న జరిగాయి. వందకు పైగా తెలుగు సంఘాలు పరిచయమైన ఈ వేదిక అనేక నక్షత్రాలను కలిపిన పాలపుంతలా తోచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్‌కు అంజలి ఘటిస్తూ ఘనంగా జరుపుకున్న “శకపురుషుని శతవసంతాలు" కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ఇప్పటివరకు 25-30 వేల మంది వీక్షించారు.

ముఖ్య అతిథులుగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్యనాయుడు ముప్పవరపు విచ్చేసి అందరికి శుభాశీస్సులు అందించారు. భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ "విలువలతో కూడిన రాజకీయాలకు నిజమైన నిర్వచనం ఎన్టీఆర్ అని, ఆయన వ్యక్తిత్వం భావితరాలకు మార్గదర్శనం అని దివంగత ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. తెలుగు భాష పరిరక్షణకు ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ పునరంకితం కావాలని వారు పిలుపునిచ్చారు. తెలుగు వారి హృదయాలపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలు తెలుగు సంఘాలు భాగస్వామ్యం వహించటం అభినందనీయమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఎన్టీఆర్‌పై ఉన్న ఎల్లలు లేని అభిమానానికి ఇది నిదర్శమన్నారు.

ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా వచ్చిన ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ అద్భుతమైన ఈ కార్యక్రమం నిర్వహించినందుకు, వారిని కూడా ఇందులో భాగం చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు.

ప్రముఖ చలనచిత్ర నటుడు మాగంటి మురళీమోహన్, ప్రముఖ చలనచిత్ర నిర్మాత చలసాని అశ్వనీదత్త్, నారా బ్రాహ్మణి, కె. లక్ష్మీనారాయణ, డా. విజయభాస్కర్ దీర్ఘాశి, గుమ్మడి గోపాలకృష్ణ, డా.శంకర నారాయణ తదితర ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.

‘వీధి అరుగు’ ఆధ్వర్యంలో కార్యక్రమం మొదలు పెట్టినప్పటికీ, 40 దేశాల నుండి తెలుగుసంస్థలు అందించిన సహాకారం వెలకట్టలేనిది. ముఖ్యంగా, వివిధ సంస్థల నుంచి అనేక మంది చిన్నారులు, పెద్దలు ఎన్టీఆర్ నటించిన సినిమాల నుండి పద్యాలు, పాటలు, నృత్యాలు చేసి కార్యక్రమం అద్భుతంగా రావడంలో పెద్ద పాత్ర పోషించారు.

అంతర్జాలంలో అంతర్జాతీయంగా 14 గంటల పాటు నిర్విరామంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఎన్టీఆర్ గొప్పతనాన్ని ముందు తరాలకు తెలియజేసేందుకు ఒక వారధి కాగలదని ‘వీధి అరుగు’ వ్యవస్థాపకులు వెంకట్ తరిగోపుల తెలియచేసారు.

ఈ కార్యక్రమం సమన్వయకర్తలుగా వ్యవహరించిన సుధాకర్ రావు కుదరవల్లి, విక్రమ్ సుఖవాసి, పావని రాగిపాని, నవీన్ సామ్రాట్ జలగడుగు, లక్ష్మణ్ వెన్నెపురెడ్డి, వై. భార్గవ్, లక్ష్మి రాయవరపు, శిరీష తూనుగుంట్ల, రాజగోపాల్ మోహన్ ఆరేటి, అశోక్ కుమార్ పారా. ఈ కార్యమానికి తోడ్పాటు అందించిన ప్రసార మధ్యమ సంస్థలకు, మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు.

చరిత్ర పుటల్లో నందమూరి తారక రామారావు పేరు స్వర్ణాక్షరాలతో అపూర్వమైన అద్భుతమైన “శకపురుషుని శతవసంతాలు” అంతర్జాల కార్యక్రమాన్ని సంకల్పించి, అందరికీ భాగస్వామ్యం కల్పించి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వెంకట్ తరిగోపులకు, అలుపెరగకుండా పనిచేసిన ఆయన బృందానికి వివిధ సంస్థల అధినేతలు అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమాన్ని https://www.youtube.com/watch?v=egLQZjdjyEE లింక్ ద్వారా వీక్షించవచ్చు.

Updated Date - 2023-05-28T22:59:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising