ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Train catches fire: గోద్రా వెళ్తుండగా రైలులో మంటలు..

ABN, First Publish Date - 2023-09-15T15:21:29+05:30

గుజరాత్‌లోని దహోద్ జిల్లా జకోట్ స్టేషన్ వద్ద దహోద్ ఆనంద్ మెము ట్రైన్‌ లోని ఒక కోచ్‌లో శుక్రవారంనాడు మంటలు చెలరేగాయి. రైలు గోద్రా వెళ్తుండగా జకోట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఎవరూ గాయపడలేదన్నారు.

దహోద్: గుజరాత్‌లోని దహోద్ (Dahod) జిల్లా జకోట్ స్టేషన్ వద్ద దహోద్ ఆనంద్ మెము ట్రైన్‌ (Dahot Anand Memu Train)లోని ఒక కోచ్‌లో శుక్రవారంనాడు మంటలు చెలరేగాయి. రైలు గోద్రా (Godhra) వెళ్తుండగా జకోట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. కోచ్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు గందరగోళానికి గురై తొక్కిసలాట జరిగిందని, అయితే ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.


అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. దహోద్ ఏఎస్‌పీ, రైల్వే సీనియర్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. రైలు చివరి కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయని, తక్కిన వాటికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఏఎస్‌పీ కె.సిధాంత్ తెలిపారు.

Updated Date - 2023-09-15T15:27:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising