Minister: మంత్రి సంచలన ప్రకటన.. ఆ సంస్థలో నష్టాల్లేవ్..
ABN, First Publish Date - 2023-06-02T12:15:18+05:30
ఆవిన్ సంస్థలో నష్టాలు లేవని, పాల సరఫరాకు అంతరాయం ఏర్పడలేదని రాష్ట్ర పాడిపరిశ్రమల శాఖ మంత్రి మనో తంగరాజ్(Minister Mano Thangaraj) పే
ప్యారీస్(చెన్నై): ఆవిన్ సంస్థలో నష్టాలు లేవని, పాల సరఫరాకు అంతరాయం ఏర్పడలేదని రాష్ట్ర పాడిపరిశ్రమల శాఖ మంత్రి మనో తంగరాజ్(Minister Mano Thangaraj) పేర్కొన్నారు. కన్నియాకుమారిలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆవిన్ లాభాల్లో నడుస్తోందని, ప్రజలకు అవసరమైన మేరకు పాల వినియోగం జరుగుతోందని తెలిపారు. పాల ఉత్పత్తిదారుల కోరిక మేరకు ఈ ఏడాది పాల కొనుగోలు ధరలను పెంచే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 45 లక్షల లీటర్ల పాల వినియోగం ఉందని, ఈ ఏడాది 75 లక్షల లీటర్లుగా పెంచనున్నట్లు మంత్రి తెలిపారు.
Updated Date - 2023-06-02T12:15:18+05:30 IST