Minister: ఎర్రమట్టి అంతపని చేసిందన్నమాట.. కోర్టుకు హాజరైన మాజీ మంత్రి
ABN, First Publish Date - 2023-09-26T10:27:41+05:30
ఎర్రమట్టి క్వారీల్లో అక్రమ తవ్వకాల కేసులో అన్నా డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్(Former Minister D. Jayakumar)
అడయార్(చెన్నై): ఎర్రమట్టి క్వారీల్లో అక్రమ తవ్వకాల కేసులో అన్నా డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్(Former Minister D. Jayakumar) సోమవారం విల్లుపురం కోర్టులో హాజరయ్యారు. కోర్టు ఆదేశం మేరకు ఆయన స్వయంగా హాజరయ్యారు. విల్లుపురం జిల్లాలోని వానూరు సమీపంలో ఉన్న పుత్తురై గ్రామంలో ఎర్రమట్టి క్వారీల్లో పరిమితికి మించి తవ్వకాలు జరపడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.24 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని పేర్కొంటూ అప్పటి వానూర్ తాహసీల్దారుకు మారబాలన్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో రాష్ట్ర ఖనిజ వనరుల శాఖ మంత్రిగా డి.జయకుమార్ ఉన్నారు. ఆ తర్వాత మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడు గౌతమ్ శిఖామణితో పాటు మొత్తం 8 మందిపై 2017లో జిల్లా క్రైం బ్రాంచ్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ విల్లుపురం జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో సాగుతోంది. ఈ కేసులో జయకుమార్ స్వయంగా హాజరయ్యారు.
Updated Date - 2023-09-26T10:27:41+05:30 IST