ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

19న ఇండియా కూటమి భేటీ?

ABN, First Publish Date - 2023-12-11T03:52:51+05:30

ఇండియా కూటమి తదుపరి సమావేశాన్ని ఈనెల 19న ఢిల్లీలో నిర్వహించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

న్యూఢిల్లీ, డిసెంబరు 10: ఇండియా కూటమి తదుపరి సమావేశాన్ని ఈనెల 19న ఢిల్లీలో నిర్వహించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు సీట్ల సర్దుబాటు, కీలకమైన సానుకూల అజెండా రూపకల్పన, ఉమ్మడి ర్యాలీల ఏర్పాటు కూటమి ముందున్న సవాళ్లలో ప్రధానమైనవి. ప్రధాని మోదీకి కౌంటర్‌గా ‘నేను కాదు.. మేము’ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. మధ్యభారతంలోని మూడు కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ తాజా ఓటమి నేపథ్యంలో సీట్ల సర్దుబాటులో ఆ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురుకానుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌తో ఉన్న విభేదాలను కాంగ్రెస్‌ పరిష్కరించుకుందని ఆ పార్టీవర్గాలు తెలిపాయి. దీంతో కూటమి సమావేశంలో అఖిలేశ్‌ పాల్గొనే అవకాశం ఉంది. టీఎంసీ అధినేత్రి మమత ఈనెల 17-19మధ్యలో ఢిల్లీలో ఉంటారు. ఆమె కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలకు అనుకూలంగా రాజకీయాలు చేసేవారు గాంధీ కుటుంబం చుట్టూ ఉంటే గనుక, 2024 ఎన్నికల్లో కాంగ్రె్‌సకు మరింత గడ్డు పరిస్థితి ఎదురుకానుందని శివసేన(యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ను ఉద్దేశించి సంజయ్‌రౌత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల పనితీరుపైనా రౌత్‌ సందేహాలు వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించినంత సేపూ 199 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ అధిక్యంలో ఉందని గుర్తుచేశారు.

Updated Date - 2023-12-11T07:10:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising