ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

iPhone Users: ఐఫోన్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. కేంద్రం ఏం చెప్పిందంటే?

ABN, Publish Date - Dec 16 , 2023 | 02:48 PM

మీరు ఐఫోన్ వాడుతున్నారా? మీ డేటాకు సంబంధించి కేంద్రం చేసిన పలు సూచనలు ఐఫోన్ వినియోగదారులకు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ యాపిల్ యూజర్లకు హై రిస్క్ అలర్ట్ జారీ చేసింది.

ఢిల్లీ: మీరు ఐఫోన్ వాడుతున్నారా? మీ డేటాకు సంబంధించి కేంద్రం చేసిన పలు సూచనలు ఐఫోన్ వినియోగదారులకు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ యాపిల్ యూజర్లకు హై రిస్క్ అలర్ట్ జారీ చేసింది. యాపిల్(Apple iPhones)కి చెందిన పలు ప్రొడక్ట్స్ లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు సైబర్ సెక్యరిటీ ఏజెన్సీ సెర్ట్ ఇన్ ఇవాళ వెల్లడించింది. సెక్యూరిటీ లోపాలతో యూజర్ల వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇది జరగకముందే సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అడ్వైజరీ జారీ అయింది. iOS, iPadOS, macOS, tvOS, watchOS, Safari బ్రౌజర్లలో భద్రతాపరమైన లోపాలున్నట్లు గుర్తించారు. వాటిని అప్ డేట్ చేసుకోవాలని లేదంటే డేటా ప్రమాదంలో పడుతుందని తెలిపింది.

కాగా శాంసంగ్ కి చెందిన పలు ఫోన్లకు ఇటీవలే కేంద్ర ఐటీ శాఖ ఇదే తరహా సెక్యూరిటీ అలర్ట్స్ జారీ చేసింది. శాంసంగ్ 11-14 ఓఎస్ తో పని చేసే సిరీస్ లలో భద్రతాపరమైన సమస్యను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Dec 16 , 2023 | 02:50 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising