ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Former CM: కర్ణాటక మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఐదు నెలల్లో రాజకీయ ముఖచిత్రం మొత్తం..

ABN, First Publish Date - 2023-05-26T13:25:35+05:30

రానున్న 5 నెలల్లో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోనుందని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై(Former Chief Minister Basavaraja Bommai)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రానున్న 5 నెలల్లో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోనుందని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై(Former Chief Minister Basavaraja Bommai) జోస్యం చెప్పారు. హావేరి జిల్లాలోని శిగ్గాంవ్‌లో గురువారం ఓటర్లకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇదే సందర్భంగా బొమ్మైను స్థానిక నేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రసంగించిన ఆయన ప్రజలు మెచ్చేలా పాలన చేయాలని కాంగ్రెస్‏కు హితవు పలికారు. ప్రస్తుతం ప్రభుత్వం పయనిస్తున్న మార్గం చూస్తుంటే ఏదో ఒక నిర్దిష్టమతం ప్రజలను బుజ్జగించే ప్రయత్నమేనని తనకు అనిపిస్తోందన్నారు. అవసరమైతే ఆర్‌ఎస్ఎస్‏ను నిషేధిస్తామని మంత్రి ప్రియాంక ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ దమ్మూ ధైర్యం సమాజంలో శాంతికి విఘాతం కలిగిస్తున్న ఎస్‌డీపీఐని ముందుగా నిషేధించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రజలు అధికారం అప్పగించారు కదా అని అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం సహించే ప్రశ్నేలేదని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్నికులాలు, మతాల ప్రజలు తనపై విశ్వాసం ఉంచి గెలిపించారని వారి రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేనన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 25కు పైగా స్ధానాల్లో విజయం సాధించడం, నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

Updated Date - 2023-05-26T13:25:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising