బస్సులో దళిత మహిళపై డ్రైవర్ల గ్యాంగ్ రేప్
ABN, Publish Date - Dec 17 , 2023 | 05:38 AM
నడుస్తున్న బస్సులోనే 20 ఏళ్ల దళిత యువతిపై ఇద్దరు డ్రైవర్లు గ్యాంగ్ రేప్ చేసినట్టు రాజస్థాన్ పోలీసులు తెలిపారు. ఈ నెల 9-10 తేదీల మధ్య రాత్రి ఉత్తరప్రదేశ్లోని
జైపూర్, డిసెంబరు 16: నడుస్తున్న బస్సులోనే 20 ఏళ్ల దళిత యువతిపై ఇద్దరు డ్రైవర్లు గ్యాంగ్ రేప్ చేసినట్టు రాజస్థాన్ పోలీసులు తెలిపారు. ఈ నెల 9-10 తేదీల మధ్య రాత్రి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నుంచి రాజస్థాన్లోని జైపూర్ వెళ్తున్న ప్రయివేటు బస్సులో ఈ దారుణం జరిగిందని చెప్పారు. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ ఆమె మాత్రం డ్రైవర్ కేబిన్లో కూర్చొని ప్రయాణించింది. దీన్ని అవకాశంగా భావించిన డ్రైవర్లు అరిఫ్, లలిత్లు అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపారు. ఆమె కేకలు వేయడంతో తోటి ప్రయాణికులు బస్సును ఆపించి అరి్ఫను అదుపులోకి తీసుకున్నారు. లలిత్ పరారయ్యాడు.
Updated Date - Dec 17 , 2023 | 06:52 AM