ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Assembly elections: కర్ణాటకకు బీజేపీ పెద్దలు.. నోటిఫికేషన్‏కు ముందే..

ABN, First Publish Date - 2023-03-17T13:07:28+05:30

రాష్ట్రానికి బీజేపీ పెద్దల రాక జోరందుకుంది. ఇటీవలే మోదీ పర్యటనలతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు నేతల వరుస పర్యట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి బీజేపీ పెద్దల రాక జోరందుకుంది. ఇటీవలే మోదీ పర్యటనలతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు నేతల వరుస పర్యటనలతో మరింత బిజీగా అయిపోయారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) రాఫ్ట్రంలో ఈ నెల 17 నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్ధరాజు గురువారం మీడియాకు వెల్లడించారు. 17న ఉదయం తోరణగల్లు విమానాశ్రయానికి చేరుకోనున్న నడ్డా అనంతరం చెళ్ళకెరెలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే విజయసంకల్పయాత్రలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు మోళకాల్మూరులో బైక్‌ ర్యాలీ(Bike rally)కి శ్రీకారం చుడతారు. తదుపరి ఇక్కడ జరిగే భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక 18న ఉదయం 11 గంటలకు తిపటూరులో జరిగే రోడ్‌షోలోనూ మధ్యాహ్నం 2 గంటలకు చిక్కనాయకనహళ్ళిలో జరిగే రోడ్‌షోలోనూ నడ్డా పాల్గొంటారు. సాయంత్రం బెంగళూరుకు చేరుకునే ఆయన పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణా కమిటీ, పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ పదాధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమాలను ముగించుకుని ఆయన అదేరాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళతారని సిద్ధరాజు వివరించారు. కార్యకర్తలు కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - 2023-03-17T13:07:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising