ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Adipurush: ‘ఆదిపురుష్’ టీమ్ గుడ్ న్యూస్ చెప్పారు.. ఈ విషయంలోనూ వివాదమే!

ABN, First Publish Date - 2023-06-21T21:36:03+05:30

సినిమా విడుదలైనప్పటి నుంచి అనేక విమర్శలను ఎదుర్కొన్న 'ఆది పురుష్' టీమ్ ఎట్టకేలకు 'గుడ్ న్యూస్' న్యూస్ చెప్పింది. ఎడిటింగ్, మార్చిన సంభాషణలతో కూడిన 3డీ వెర్షన్‌కు సకుటుంబ సమేతంగా రమ్మని ఆహ్వానిస్తూ, ఇందుకోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. అయితే.. ఈ విషయంలో కూడా వివాదం తొంగిచూసింది.

Adipurush Still

ముంబై: సినిమా విడుదలైనప్పటి నుంచి అనేక విమర్శలను ఎదుర్కొన్న 'ఆది పురుష్' (Adipurush) టీమ్ ఎట్టకేలకు 'గుడ్ న్యూస్' చెప్పింది. ఎడిటింగ్, మార్చిన సంభాషణలతో కూడిన 3డీ వెర్షన్‌కు సకుటుంబ సమేతంగా రమ్మని ఆహ్వానిస్తూ, ఇందుకోసం ప్రత్యేక ఆఫర్ (Special Offer) ప్రకటించింది. అయితే.. ఈ విషయంలో కూడా వివాదం తొంగిచూసింది.

రూ.150 కే టిక్కెట్...

అందరికీ అందుబాటులో ఉండేలా రూ.150 నుంచి టిక్కెట్ ఆఫర్‌ను ఆదిపురుష్ నిర్మాతలు ప్రకటించారు. ఈనెల 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ ఆఫర్ వర్తిస్తుందని చెబుతూనే...ఓ మెలిక పెట్టింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం ఈ ఆఫర్ వర్తించదని ప్రకటించింది. స్పెషల్ ఆఫర్ అంటూనే... ఆ నాలుగు తప్ప...అంటూ ప్రకటించడం వెనుక మెలిక ఏమిటో 'ఆదిపురుష్' సృష్టికర్తలే (నిర్మాతలు) చెప్పాలంటూ నెటిజన్లు మళ్లీ కామెంట్లు గుప్పిస్తున్నారు.

ప్రభాస్, కృతి సనన్, సన్నీ సింగ్, సైఫ్ అలీఖాన్, దేవ్‌దత్తా నగే కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రానికి మనోజ్ ముంతాషిర్ సంభాషణలు అందించగా, టీ సిరీస్ నిర్మించింది. ఓం రౌత్ దర్శకత్వంలో ఈనెల 16న పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

Updated Date - 2023-06-21T21:40:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising