ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లిదండ్రులు పెళ్లిచూపులకు వెళ్లారు.. ఇంట్లో ఉన్న అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ చివరికి..

ABN, First Publish Date - 2023-05-25T12:47:41+05:30

స్థానిక మాధవరం తిరుమలై నగర్‌లో తమ్ముడిని కత్తితో హతమార్చిన అన్నను పోలీసులు అరెస్టు చేశారు. తిరుమలై నగర్‌లో నివసిస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): స్థానిక మాధవరం తిరుమలై నగర్‌లో తమ్ముడిని కత్తితో హతమార్చిన అన్నను పోలీసులు అరెస్టు చేశారు. తిరుమలై నగర్‌లో నివసిస్తున్న వెంకటేష్‌కు సురేష్‌(26), శ్రీనివాసులు(24), శ్రీకాంత్‌(20) అనే ముగ్గురు కుమారులున్నారు. సురేష్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తుండగా, శ్రీనివాసులు కాల్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు. ఇక శ్రీకాంత్‌(Srikanth) ప్రైవేటు కళాశాలలో చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సురేష్‌కు వధువును చూసేందుకు తల్లిదండ్రులు ఆంధ్రాకు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురు అన్నదమ్ములు మాత్రమే ఇంట్లో వున్నారు. ఈ సందర్భంగా సురేష్‌ ఇద్దరు తమ్ముళ్లపై దాడి చేశాడు. క్షతగాత్రులను చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించగా, సురేష్‌ పరారయ్యాడు. సమాచారం అందుకున్న మాధవరం ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆ సమయంలో ఓ ఇంట్లో దాగిన సురేష్‌ను అరెస్టు చేశారు. అయితే ఆసుపత్రి లో చేరిన శ్రీనివాసులు బుధవారం కన్ను మూశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-05-25T12:47:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising