పదిహేనేళ్ల తర్వాత అత్యాచారం కేసు పెట్టిన మహిళ.. పెళ్లి చేసుకోకపోగా డబ్బులు కూడా తీసుకున్నాడంటూ..
ABN, First Publish Date - 2023-01-30T19:11:29+05:30
జైపూర్కు (Jaipur) చెందిన ఓ మహిళ పదిహేనేళ్ల తర్వాత ఓ వ్యక్తిపై అత్యాచారం కేసు పెట్టింది. పెళ్లి పేరుతో తనతో 15 ఏళ్లుగా శారీరక సంబంధం పెట్టుకున్నాడని, తను నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జైపూర్కు (Jaipur) చెందిన ఓ మహిళ పదిహేనేళ్ల తర్వాత ఓ వ్యక్తిపై అత్యాచారం కేసు పెట్టింది. పెళ్లి పేరుతో తనతో 15 ఏళ్లుగా శారీరక సంబంధం పెట్టుకున్నాడని, తను నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు పెళ్లి చేసుకోకపోగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. 35 ఏళ్ల మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు (Rajasthan Crime News).
జైపూర్లోని మల్పురా గేట్కు చెందిన 35 ఏళ్ల మహిళ చాలా కాలంగా ప్రసాద్ అనే యువకుడితో 15 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. ఒంటరిగా ఉన్న ఆమెతో నిందితుడు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. బాధితురాలిని నమ్మించేందుకు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అలా చెప్పి గత 15 ఏళ్లుగా అత్యాచారం చేస్తూనే ఉన్నాడు (Sexual Harassment). అంతేకాదు ఆమె నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా బాధితురాలిని తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. తాను మోసపోయినట్టు తెలుసుకున్న బాధితురాలు నిందితుడిపై ఫిర్యాదు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Updated Date - 2023-01-30T19:11:30+05:30 IST