తడిసిన ధాన్యాన్ని కొంటాం.. ఆందోళన వద్దు
ABN, First Publish Date - 2023-12-13T04:27:57+05:30
తుఫాను కారణంగా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేస్తుందని,
సంక్రాంతిలోగా ఇన్పుట్ సబ్సిడీ: సీఎం జగన్
అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): తుఫాను కారణంగా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆర్బీకేల వారీగా రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించే బాధ్యతను అధికారులు తీసుకుంటారని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అందుకుంటుందన్న భరోసాను రైతులకు కల్పించాలని ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కొన్ని నిబంధనలను సడలించైనా రైతులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. సంక్రాంతి పండుగలోగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Updated Date - 2023-12-13T04:27:58+05:30 IST