ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డెక్కిన వలంటీర్లు

ABN, Publish Date - Dec 28 , 2023 | 03:54 AM

తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వేతనాలు పెంచాలని వార్డు వలంటీర్లు డిమాండ్‌ చేశారు.

ఉద్యోగ భద్రత, వేతనాల పెంపునకు డిమాండ్‌

మహారాణిపేట/డాబాగార్డెన్స్‌(విశాఖపట్నం), ఒంటిమిట్ట(కడప జిల్లా), డిసెంబరు 27: తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వేతనాలు పెంచాలని వార్డు వలంటీర్లు డిమాండ్‌ చేశారు. బుధవారం విశాఖ కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టి, అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలంటీర్లను స్వచ్ఛంద సేవకులుగా కాకుండా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని కోరారు. అంతకుముందు పలు వార్డుల వలంటీర్లు డాబాగార్డెన్స్‌ సరస్వతీ పార్కు వద్ద నిరసన తెలిపారు. బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వలంటీర్ల సేవలను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కడప జిల్లా ఒంటిమిట్టలోనూ ఎంపీడీవో కార్యాలయంవద్ద వేతనాలు పెంచాలంటూ వలంటీర్లు నిరసన తెలిపారు.

Updated Date - Dec 28 , 2023 | 03:54 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising