ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఉండరాదు
ABN, Publish Date - Dec 14 , 2023 | 11:31 PM
ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు చేపట్టాలని పార్వతీపురం ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్ అన్నారు.
ధాన్యం కొనుగోలు క్రేందాన్ని తనిఖీ చేస్తున్న పీవో
- ఐటీడీఏ పీవో విష్ణుచరణ్
పార్వతీపురం రూరల్, డిసెంబరు 14: ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు చేపట్టాలని పార్వతీపురం ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్ అన్నారు. పార్వతీపురం మండలంలోని అడ్డాపుశీల ధాన్యం కొనుగోలు క్రేందాన్ని గురువారం పీవో తనిఖీ చేశారు. రైతులు నూర్పిడి చేసిన వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని, సంబంధిత మిల్లులకు తక్షణమే తరలించాలని అధికారులను పీవో ఆదేశించారు. ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలన్నారు. రైతులకు అవసరమైన గన్నీ సంచులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
Updated Date - Dec 14 , 2023 | 11:31 PM