ఒడిశా నుంచి తిరిగొచ్చాయ్
ABN, Publish Date - Dec 28 , 2023 | 12:06 AM
ఏనుగుల గుంపు ఒడిశా ప్రాంతమైన చీకటిలోవ వరకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చేశాయి. మంగళవారం రాత్రి కొమరాడ మండలం కందివలస గ్రామ సమీపంలో ఉన్న పంట పొలాల్లోని ధాన్యం బస్తాలను చించేసి చిందరవందర చేశాయి.
కొమరాడ, డిసెంబరు 27 : ఏనుగుల గుంపు ఒడిశా ప్రాంతమైన చీకటిలోవ వరకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చేశాయి. మంగళవారం రాత్రి కొమరాడ మండలం కందివలస గ్రామ సమీపంలో ఉన్న పంట పొలాల్లోని ధాన్యం బస్తాలను చించేసి చిందరవందర చేశాయి. అంతేకాకుండా సమీపంలో ఉన్న టమాటా పంటను కూడా నాశనం చేశాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. అటవీశాఖ సిబ్బంది ఏనుగులను పర్యవేక్షించక పోవడం వల్లే తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నధికారులు స్పందించి ఏనుగుల గుంపు సంచరించే ప్రాంతాల్లో ముందస్తుగా రైతులను అప్రమత్తం చేయాలని, ఇక్కడి నుంచి వాటిని తరలించేలా చర్యలు చేపట్టాలని మండలవాసులు కోరుతున్నారు.
Updated Date - Dec 28 , 2023 | 12:06 AM