బాలిక అదృశ్యం
ABN, First Publish Date - 2023-11-06T00:18:25+05:30
మండలంలోని పెంటశ్రీరాంపురం గ్రామానికి చెందిన బాలిక గత రెండు రోజులు నుంచి కన్పించడంలేదని ఎస్ఐ కిల్లారి కిరణ్ కుమార్ నాయుడు పేర్కొన్నారు
గంట్యాడ: మండలంలోని పెంటశ్రీరాంపురం గ్రామానికి చెందిన బాలిక గత రెండు రోజులు నుంచి కన్పించడంలేదని ఎస్ఐ కిల్లారి కిరణ్ కుమార్ నాయుడు పేర్కొన్నారు. గ్రామంలోని పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రవంతి ఈనెల 3న స్కూల్కు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె కోసం కుటుంబీకులు రెండు రోజులు వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం గంట్యాడ పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది.
Updated Date - 2023-11-06T00:18:27+05:30 IST