ఉద్యోగులకు బకాయి చెల్లింపులపై స్పష్టత ఇవ్వాలి
ABN, First Publish Date - 2023-10-30T01:14:19+05:30
ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఎప్పటిలోగా చెల్లిస్తారో.. స్పష్టత ఇవ్వాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
కలెక్టరేట్: ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఎప్పటిలోగా చెల్లిస్తారో.. స్పష్టత ఇవ్వాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం విజయనగరం జిల్లాకు వచ్చిన ఆయన జిల్లా కార్యవర్గం ఎన్నిక నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ ఆప్కాస్లో లేని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ద్వారా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. సీనియార్టీ ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచి ప్రభుత్వ పఽథకాలు అమలు చేయాలని కోరారు. ఉద్యోగ విరమణ చేసిన వారి సెటిల్ మెంట్లతో పాటు పెన్షనర్లు అందరికీ రావాల్సిన బకాయిలు చెల్లించి, పెన్షన్ ప్రతినెల సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఏపీజేఏసీ అమరావతి నూతన కమిటీ ఎన్నిక ఆదివారం నిర్వహించారు. జిల్లా చైర్మన్ తాడ్డి గోవింద, ప్రధాన కార్యదర్శి పి.భానుమూర్తి, అసోసియేట్ చైర్మన్గా విజయకుమార్, కోశాధికారిగా వి.సత్యనారా యణతో పాటు మరో 8 మంది కోచైర్మన్లు ఎన్నికయ్యారు. వీరిని రాష్ట్ర నాయకులు అభినందించారు. సంఘ నాయకులు దామోదర్, శ్రీనివాసరావు, సాంబశివరావు, శ్రీని వాసరావు తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-10-30T01:14:19+05:30 IST