ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఇక మేము వెళ్తున్నాం.. మీరు జాగ్రత్త అంటూ దంపతుల సెల్ఫీ వీడియో...

ABN, First Publish Date - 2023-03-28T10:12:36+05:30

ఆర్థిక ఇబ్బందుల తాళలేక సూసైడ్ చేసుకుంటున్నామంటూ దంపతులు తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖపట్నం: ఆర్థిక ఇబ్బందుల తాళలేక సూసైడ్ చేసుకుంటున్నామంటూ దంపతులు తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. విశాఖలోని వడ్లపూడి తిరుమలానగర్‌కు చెందిన వరప్రసాద్ దంపతులు తాము ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు నిన్న సాయంత్రం తాముంటున్న ఇంట్లోనే ఓ సెల్ఫీ వీడియోలో చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నామని కుమారుడు, బంధువులకు సెల్ఫీ వీడియో పంపించారు. ‘‘ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాము. ఇక మేము వెళ్తున్నాం.. మీరు జాగ్రత్త.. అమ్మ‌మ్మను చూసుకోండి. అల్లుడు గారు మా కుమార్తెను బాగా చూసుకోండి. మీకు ఇవ్వాల్సినవి ఇవ్వలేకపోతున్నాము ఏమీ అనుకోవద్దు.’’ అంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన చెందారు. మా పిల్లలను బాగా చూసుకోండి అంటూ బంధువులను ఉద్దేశిస్తూ దంపతులు తీసిన వీడియో కన్నీరు తెప్పిస్తోంది.

వీడియో చూసిన కుమారుడు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే దంపతుల కోసం గాలించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ వారి ఆచూకి లభించలేదు. అయితే అనకాపల్లి జిల్లాలోని ఏలేరు కాలువ వద్ద దంపతుల బ్యాగు, దుస్తులు లభ్యమయ్యాయి. దీంతో కుమారుడు కృష్ణతేజ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు తేల్చారు. దంపతుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Updated Date - 2023-03-28T10:15:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising