కొండంత జనం
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:08 AM
ప్రముఖ పర్యాట కేంద్రం వంజంగి మేఘాల కొండ సోమవారం పర్యాటకులతో కిటకిటలాడింది. ఎక్కువగా శని, ఆదివారాల్లోనే పర్యాటకులతో కళకళలాడే ఈ పర్వతాన్ని సోమవారం రెట్టింపు పర్యాటకులు సందర్శించారు.
వంజంగి మేఘాల కొండపై పర్యాటకుల సందడి
- పర్యాటకులతో కిటకిటలాడిన వంజంగి మేఘాల కొండ
పాడేరురూరల్, డిసెంబరు 25: ప్రముఖ పర్యాట కేంద్రం వంజంగి మేఘాల కొండ సోమవారం పర్యాటకులతో కిటకిటలాడింది. ఎక్కువగా శని, ఆదివారాల్లోనే పర్యాటకులతో కళకళలాడే ఈ పర్వతాన్ని సోమవారం రెట్టింపు పర్యాటకులు సందర్శించారు. క్రిస్మస్ సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో పర్యాటకులు పోటెత్తారు. సోమవారం వంజంగి మేఘాల కొండను సందర్శించి కొత్తపల్లి జలపాతం, చెరువుల వేనం ప్రాంతాలకు తరలివెళ్లారు.
Updated Date - Dec 26 , 2023 | 12:08 AM