ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ 9 మందికి రాజ్యసభ సీట్లిచ్చింది: కళా

ABN, Publish Date - Dec 18 , 2023 | 03:04 AM

తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు తొమ్మిది మంది బీసీ నేతలకు రాజ్యసభ సీట్లు ఇచ్చిందని మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు గుర్తు చేశారు.

అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు తొమ్మిది మంది బీసీ నేతలకు రాజ్యసభ సీట్లు ఇచ్చిందని మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు గుర్తు చేశారు. ఒక్క బీసీకి కూడా రాజ్యసభ సీటు ఇవ్వలేదన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు.‘బీసీ నేతలు రూమాళ్ల రామచంద్రయ్య, గుండు సుధారాణి, అల్లాడి రాజకుమార్‌, జయప్రద, కెంబూరి రామ్మోహన్‌ రావు, కళా వెంకట్రావు, దేవేందర్‌గౌడ్‌, ప్రొఫెసర్‌ లక్ష్మన్న, జీ రామచంద్రయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చింది. సామాన్య బీసీలను టీడీపీ రాజ్యసభకు పంపితే, వైసీపీ రూ.కోట్లు తీసుకుని, కార్పొరేట్లకు, పక్క రాష్ట్రాల వారికి సీట్లు ఇచ్చింది’ అని అన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 03:04 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising