సంఘటిత పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:59 PM
సంఘటిత పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతా యని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి ధనుంజయరావు అన్నారు. చల్లవానిపేట సబ్స్టేషను సమీపంలోని మామిడి తోటలో మంగళవారం సంఘ సమావేశం నిర్వహించారు.
జలుమూరు: సంఘటిత పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతా యని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి ధనుంజయరావు అన్నారు. చల్లవానిపేట సబ్స్టేషను సమీపంలోని మామిడి తోటలో మంగళవారం సంఘ సమావేశం నిర్వహించారు. మండల కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రతి మండలంలో సంఘాల ఏర్పాటు ద్వారా బలోపేతం చేయాలన్నారు. మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా వమరవెల్లి వీరాస్వామి, ఉపాధ్యక్షుడిగా సింహాద్రి అప్పలరాజు, ప్రధాన కార్యదర్శిగా సింహాద్రి రామకృష్ణ, సహాయ కార్యదర్శిగా గానుగుల మధు, కోశాధికారిగా దమరసింగి చందర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో లింగాలవలస, చల్లవానిపేట సర్పంచ్లు దుంగ స్వామిబాబు, పంచిరెడ్డి రామచంద్రరావు, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 11:59 PM