ప్రజలకు మెరుగైన సేవలందించాలి
ABN, First Publish Date - 2023-10-28T23:56:33+05:30
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులం దరూ కృషి చేయాలని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి.జ్ఞానసువర్ణరాజు సూచించారు.
అరసవల్లి: ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులం దరూ కృషి చేయాలని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి.జ్ఞానసువర్ణరాజు సూచించారు. శాశ్వత లోక్అదాలత్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వ ర్యంలో శనివారం న్యాయసేవా సదన్ లో హైలెవెల్ కమిటీ సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా సువర్ణరా జు మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజన సేవలకు భంగం వాటిల్లితే, ఆ వ్యక్తి శాశ్వత లోక్అదాలత్ను ఆశ్రయించవచ్చని తెలిపారు. సమావేశంలో డీఆర్వో ఎం.గణపతిరావు, డిప్యూటీ డీఎంహెచ్వో బి.అనూరాధ, డిప్యూటీ డీఈవో తిరుమల చైతన్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-28T23:56:33+05:30 IST