తరగతిగదిలోకి దూరి.. విద్యార్థిపై కోతుల దాడి
ABN, Publish Date - Dec 14 , 2023 | 12:24 AM
ఇచ్ఛాపురంలోని పంజావీధి మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి చాట్ల తేజపై కోతులు దాడి చేయగా.. తీవ్రంగా గాయపడ్డాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి తేజ
ఇచ్ఛాపురం, డిసెంబరు 13: ఇచ్ఛాపురంలోని పంజావీధి మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి చాట్ల తేజపై కోతులు దాడి చేయగా.. తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం మ్యాథ్స్ టీచర్ బోధిస్తుండగా.. సుమారు 50 కోతులు తరగతి గదిలోకి చొరబడ్డాయి. ఉపాధ్యాయురాలితో పాటు విద్యార్థులు భయాందోళన చెందారు. ఈ క్రమంలో కోతులు దాడి చేయడంతో విద్యార్థి తేజకు తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల సిబ్బంది ఆ కోతులను తరిమేశారు. గాయపడిన తేజను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోజూ కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు డి.ధనలక్ష్మి కోరారు.
Updated Date - Dec 14 , 2023 | 12:24 AM