ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైభవంగా హిందూ ధార్మిక మహాసమ్మేళనం

ABN, First Publish Date - 2023-12-11T00:31:21+05:30

పొందూరు మండలం కృష్ణాపురంలోని ఆనందాశ్రమంలో ఆదివారం హిందూ ధార్మిక మహాసమ్మేళనం వైభవంగా నిర్వహించారు.

మాట్లాడుతున్న స్వామీ శ్రీనివాసానంద

పొందూరు, డిసెంబరు 10: పొందూరు మండలం కృష్ణాపురంలోని ఆనందాశ్రమంలో ఆదివారం హిందూ ధార్మిక మహాసమ్మేళనం వైభవంగా నిర్వహించారు. ఆనందాశ్రమ పీఠాధిపతి, సాధుపరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా.. అధిక సంఖ్యలో హిందువులు, భక్తులు పాల్గొన్నారు. ‘హిందువునని గర్విద్దాం.. హిందువుగా జీవిద్దాం’ అని నినాదాలు చేశారు. రాష్ట్రంలో అన్యమత ప్రచారాలు, మతమార్పిడులు పెరిగిపోయాయని, హిందూ సనాతన ధర్మాన్ని, సంస్కృతి సంప్రదాయాలను మనమే పరిరక్షించుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ హిందూప్రచారకులు(తిరుపతి) రాధా మనోహర్‌దాస్‌ స్వామీజీ, యోగేష్‌ ప్రభూజీ స్వామీజీ (హైదరాబాద్‌), పద్మజానంద మాతాజీ, ప్రకాశానంద సరస్వతి(గుంటూరు), ఒడిశా నుంచి 24 మంది స్వామీజీలు 20 వేలమంది భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T00:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising