వైసీపీ పాలనలో రైతులకు మోసం : మర్రెడ్డి
ABN, Publish Date - Dec 18 , 2023 | 11:59 PM
వైసీపీ పాలనలో రాష్ట్రంలోని రైతులు మోసపోయారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. చల్లవానిపేటలో నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు పంచిరెడ్డి రామచంద్రరావు ఇంటిలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు అన్ని విధాలా నష్టపోయారని, అయితే బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పట్టిం చుకోకపోవడం దారుణమన్నారు.
జలుమూరు: వైసీపీ పాలనలో రాష్ట్రంలోని రైతులు మోసపోయారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. చల్లవానిపేటలో నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు పంచిరెడ్డి రామచంద్రరావు ఇంటిలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు అన్ని విధాలా నష్టపోయారని, అయితే బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పట్టిం చుకోకపోవడం దారుణమన్నారు. వర్షాభావ పరిస్థితులు, తుఫాన్ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయి నప్పటికీ ఆయా ప్రాంతాలను పరిశీలించి బాధితులకు భరోసా ఇవ్వడానికి సీఎం జగన్కు తీరిక లేదని ఎద్దేవా చేశారు. జగన్ మాయమాటలు, మోసాలు రైతులు గ్రహించారని వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నార న్నారు. కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుపల్లి హరిబాబు, కార్యదర్శి శేఖర్నాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకుడు జల్లు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 11:59 PM