వైసీపీ మాయమాటలను నమ్మవద్దు
ABN, Publish Date - Dec 28 , 2023 | 11:54 PM
వైసీపీ నాయకుల మాయమాటలను నమ్మవద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం జిల్లాలో పలుచోట్ల బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. బాండ్లు పంపిణీచేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలుచేసే పథకాలను వివరించారు. వైసీపీ ప్రభుత్వ వైఫలాలను తెలియజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ జగన్ అవినీతి పాలనను అంతంచేయాలని కోరారు.
వైసీపీ నాయకుల మాయమాటలను నమ్మవద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం జిల్లాలో పలుచోట్ల బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. బాండ్లు పంపిణీచేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలుచేసే పథకాలను వివరించారు. వైసీపీ ప్రభుత్వ వైఫలాలను తెలియజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ జగన్ అవినీతి పాలనను అంతంచేయాలని కోరారు.
ఫ పాతపట్నం: చంద్రబాబుతోనే రాష్ట్రంలో సుస్థిరపాలన సాధ్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ తెలిపారు.మండలంలోని దశరధపు రం, సూర్యనారాయణపురం కాలనీల్లో బాబుష్యూరిటీ-భవిష్యత్కు గ్యారెంటీ, గ్రామకూడలిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో టీడీపీ బీసీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైల లక్ష్మయ్య, పార్టీనాయకులు కొంచాడ రుద్ర, శివాల కృష్ణ, వెంకటరావు, కె.గణపతి, బి.ధర్మారావు, కె.పార్వతీశం, పి.రమేష్, రోకళ్ల శివాజీ, పి.మాధవ, పి.దాలయ్య పాల్గొన్నారు.
ఫనరసన్నపేట: అవినీతి ఊబిలో కూరుకుపోయిన సీఎం జగన్ను ఇంటికి పంపకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని టీడీపీ నాయకులు కిం జరాపు రామారావు, సతీష్, గోవిందరాజు తెలిపారు. పట్టణంలో జోగి పేటలో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.
ఫ వజ్రపుకొత్తూరు:చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని పూండి క్లస్టర్ ఇనచార్జి పుచ్చఈశ్వరరావు తెలిపారు. అమలపాడులో బాబు ష్యూరిటీ-భవి ష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం మాజీసర్పంచ్షణ్ముఖరావు ఆధ్వర్యంలో జరి గింది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్నిరమణ, గోవిందు పాపారావు, చింతనారాయణ, కారాడ సన్యాసి, దండు జోగారావు పాల్గొన్నారు.
ఫ జలుమూరు: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ సర్పంచ్ పొన్నాడ దాలయ్య తెలిపారు. సారవకోట మండలంలోని కరకవలసకాలనీలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వ హిం చారు. కార్యక్రమంలో శ్రీముఖలింగం మాజీ సర్పంచ్ తర్ర బలరాం, జి.వెంకటరమణ పాల్గొన్నారు.
ఫజలుమూరు (సారవకోట) : టీడీపీతోనే భావితరాల భవిష్యత్తు బాగుంటుందని సారవకోట టీడీపీ మండలాధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ తెలిపారు. మండలం తొగిరిలో బాబుష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకుడు పిళ్లా నందకిషోర్, తెలుగు రైతు మండలాధ్యక్షుడు తండ్యాల సింహాచలం, నేతింటి ఈశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2023 | 11:54 PM