5న లక్ష్మీ నారసింహ స్వామి కళ్యాణోత్సవం
ABN, First Publish Date - 2023-10-30T00:01:39+05:30
ల్లాలో మొ ట్టమొదటిసారిగా సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనార సింహస్వామి కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి భక్తబృందం సభ్యు లు తెలిపారు.
ఒంగోలు(కల్చరల్), అక్టోబరు 29: జిల్లాలో మొ ట్టమొదటిసారిగా సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనార సింహస్వామి కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి భక్తబృందం సభ్యు లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను వారు ఆదివారం సాయంత్రం ఒంగోలులోని బాలా జీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నల్లమల్లి బాలు మాట్లాడుతూ జి ల్లాలో తొలిసారిగా నిర్వహించే ఈ కార్యక్రమానికి సింహాచలం నుంచి ఆలయ పండితులు స్వామి వారి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తీసుకొని వ స్తారన్నారు. నవంబరు 4వ తేదీ శనివారం సా యంత్రం స్థానిక కేశవస్వామిపేట శ్రీ ప్రసన్న చెన్న కేశవ స్వామి దేవస్థానం దగ్గర నుంచి నగరంలో స్వామి వారి శోభాయాత్ర జరుగుతుందని తెలిపా రు. అదేవిధంగా ఆదివారం ఉదయం బాలాజీ తి రుపతిరావు కళ్యాణమండపం ప్రాంగణలో ప్రత్యేకం గా ఏర్పాటుచేసిన కళ్యాణ వేదిక వద్ద సుదర్శన నారసింహ హోమం, సాయంత్రం 6 గంటల నుం చి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించటానికి ఏ ర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పతంజలి యోగా రాష్ట్ర అధ్యక్షుడు గంధవళ్ల బాలసుబ్రహ్మణ్యం మా ట్లాడుతూ చక్కా ప్రసాదు, సునీతల సౌజన్యంతో ఏర్పాటుచేసే ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలు పె ద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కో రారు. చక్కా ప్రసాదు ప్రసంగిస్తూ లోక కళ్యాణా ర్థం వరాహ లక్ష్మీనృసింహ స్వామి కళ్యాణోత్సవం న గరంలో తొలిసారిగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స మావేశంలో సూపర్బజార్ చైర్మన్ తాతా బదరి, కోడూరి కిషోర్, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.
Updated Date - 2023-10-30T00:01:39+05:30 IST