ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు తీరని నష్టం : చేజర్ల
ABN, First Publish Date - 2023-12-06T21:54:23+05:30
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కోవూరు నియోజకవర్గ పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రఽధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర్లురెడ్డి తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం
కోవూరు, డిసెంబరు 6 : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కోవూరు నియోజకవర్గ పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రఽధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర్లురెడ్డి తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వం సాగునీటి కాలువల్లో పూడికలు తీయకపోవడంతో నీరు పొంగి వరినాట్లు దెబ్బతిన్నాయన్నారు. ఈదురు గాలులకు ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. టీడీపీ హయాంలో తుఫాన్లు వస్తే నిబంధనల్ని పక్కన పెట్టి రైతులను ఆదుకున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం నష్టపోయిన రైతులందరిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు పంతంగి రామారావు, కలికి సత్యనారాయణరెడ్డి, ఇంటూరి విజయ్, కుక్కంటి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-06T21:54:25+05:30 IST