AP News: నెల్లూరులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి
ABN, First Publish Date - 2023-01-24T09:31:23+05:30
జిల్లాలోని కావలి మండలం గౌరవరం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
నెల్లూరు: జిల్లాలోని కావలి మండలం గౌరవరం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. కారులోని ఐదు మంది ప్రయాణికుల్లో ఒకరు మృతి చెందగా... ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలు తనియాలి గ్రామ మాజీ సర్పంచ్ సంచి రవణమ్మగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2023-01-24T09:31:24+05:30 IST