ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అయోధ్య శ్రీరామ అక్షింతలకు పూజలు

ABN, First Publish Date - 2023-12-10T23:37:04+05:30

చాగలమర్రి గ్రామంలోని పట్టాభిరామ ఆలయం, శివరామానంద ఆశ్రమంలో ఆదివారం అయోద్య శ్రీరామ ఆలయం నుంచి తెచ్చిన అక్షింతలకు వేద పండితుడు పెద్దశాస్త్రి ఆధ్వర్యంలో ముందుగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.

అయోధ్య శ్రీరామ అక్షింతలను తయారు చేస్తున్న భక్తులు

చాగలమర్రి, డిసెంబరు 10: చాగలమర్రి గ్రామంలోని పట్టాభిరామ ఆలయం, శివరామానంద ఆశ్రమంలో ఆదివారం అయోద్య శ్రీరామ ఆలయం నుంచి తెచ్చిన అక్షింతలకు వేద పండితుడు పెద్దశాస్త్రి ఆధ్వర్యంలో ముందుగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. అయోద్య శ్రీరామ ఆలయం నుంచి తెచ్చిన అక్షింతలకు మరిన్ని బియ్యం కలిపి అక్షింతలుగా తయారు చేశారు. ఆయా గ్రామాల్లో అయోధ్య శ్రీరామ అక్షింతలు పంపిణీ చేస్తామని సమరసతా సేవా ఫౌండేషన్‌ జిల్లా సహకన్వీనర్‌ సల్లా నాగరాజు తెలిపారు. అక్షింతలను పవిత్రంగా ఉంచి భక్తులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఎస్‌ఎస్‌ఎఫ్‌ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

ప్యాపిలి: అయోధ్య శ్రీరాముడి అభిషేకం అక్షింతలను ప్రతి గ్రామానికి అందించాలని విశ్వహిందూ పరిషత్‌ జిల్లా సహాయ కార్యదర్శి రామకృష్ణ సూచించారు. ఆదివారం పట్టణంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఆయన మాట్లాడుతూ ఆయోధ్య రామాలయం దేశానికే తలమానికం అన్నారు. రామ మందిరం విశిష్టతను ప్రతి గ్రామంలో కూడా ప్రజలకు తెలియజేయాలన్నారు. విశ్వహిందూ పరిషత్‌ నాయకులు రామ రాజేష్‌, గోపాల్‌రెడ్డి, నరేష్‌ కుమార్‌, అశోక్‌, రవిసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T23:37:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising