రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:44 PM
మండలంలోని పోతుదొడ్డి గ్రామం సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ విశ్వనాథం(45) మృతి చెందారు.
ప్యాపిలి, డిసెంబరు 17: మండలంలోని పోతుదొడ్డి గ్రామం సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ విశ్వనాథం(45) మృతి చెందారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు ఐస్క్రీమ్ లోడుతో కంటెనౖర్ బయలుదేరిదింది. మార్గం మధ్యలోని పోతుదొడ్డి దగ్గరకు రాగానే వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడి కక్కడే మృతి చెందినట్లు ఏఎ్సఐ శ్రీనివాసలు తెలిపారు. బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
Updated Date - Dec 17 , 2023 | 11:44 PM