ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘనంగా హిందూ ధర్మ సమ్మేళనం

ABN, First Publish Date - 2023-12-10T23:35:09+05:30

దొర్నిపాడులోని ఆదిఅల్లూరి ఎరుకలి స్వామి దేవాలయ ఆవరణలో ఆదివారం సమరసతా సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హిందూధర్మ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.

హిందూధర్మ సమ్మేళన ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

దొర్నిపాడు, డిసెంబరు 10: దొర్నిపాడులోని ఆదిఅల్లూరి ఎరుకలి స్వామి దేవాలయ ఆవరణలో ఆదివారం సమరసతా సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హిందూధర్మ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జయదేవానందగిరి స్వామి హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగం చలమల రామకృష్ణ, ఎస్‌ఎస్‌ఎఫ్‌ నంద్యాల జిల్లా కన్వీనర్‌ మాధవరెడ్డి హాజరయ్యారు. గ్రామంలోని పురవీధుల గుండా ర్యాలీ చేపట్టారు. అనంతరం భక్తులకు భజన బృందాల ద్వార కోలాటం, అయ్యప్పస్వామి భజన, భగవద్గీత పారాయణం ప్రజలకు వినిపించారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చలుంగారి అమరేశ్వరయాదవ్‌, ఎస్‌ఎస్‌ఎఫ్‌ నంద్యాల జిల్లా ఉపాధ్యాయ కన్వీనర్‌ బాలతిమ్మారెడ్డి, జిల్లా సహాయ కన్వీనర్‌ నాగరాజు, శ్రీనివాసరెడ్డి, పోలిశెట్టి బాలవీరయ్య, శేకూరి చక్రవర్తినాయుడు, సిద్ధి సత్యం, రమణారెడ్డి, వెంకటసుబ్బయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-12-10T23:35:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising