ఘనంగా హిందూ ధర్మ సమ్మేళనం
ABN, First Publish Date - 2023-12-10T23:35:09+05:30
దొర్నిపాడులోని ఆదిఅల్లూరి ఎరుకలి స్వామి దేవాలయ ఆవరణలో ఆదివారం సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూధర్మ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.
దొర్నిపాడు, డిసెంబరు 10: దొర్నిపాడులోని ఆదిఅల్లూరి ఎరుకలి స్వామి దేవాలయ ఆవరణలో ఆదివారం సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూధర్మ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జయదేవానందగిరి స్వామి హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ విభాగం చలమల రామకృష్ణ, ఎస్ఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కన్వీనర్ మాధవరెడ్డి హాజరయ్యారు. గ్రామంలోని పురవీధుల గుండా ర్యాలీ చేపట్టారు. అనంతరం భక్తులకు భజన బృందాల ద్వార కోలాటం, అయ్యప్పస్వామి భజన, భగవద్గీత పారాయణం ప్రజలకు వినిపించారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చలుంగారి అమరేశ్వరయాదవ్, ఎస్ఎస్ఎఫ్ నంద్యాల జిల్లా ఉపాధ్యాయ కన్వీనర్ బాలతిమ్మారెడ్డి, జిల్లా సహాయ కన్వీనర్ నాగరాజు, శ్రీనివాసరెడ్డి, పోలిశెట్టి బాలవీరయ్య, శేకూరి చక్రవర్తినాయుడు, సిద్ధి సత్యం, రమణారెడ్డి, వెంకటసుబ్బయ్య తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-12-10T23:35:10+05:30 IST