పంచారామాలకు ప్రత్యేక బస్సులు
ABN, First Publish Date - 2023-11-10T01:31:46+05:30
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతి శని, ఆదివారాల్లో పంచారామ పుణ్యక్షేత్రాలు దర్శించుకునే భక్తుల కోసం ఉయ్యూరు నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ కేఎస్ఆర్కే ప్రసాద్ గురు వారం తెలిపారు.
ఉయ్యూరు, నవంబరు 9: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతి శని, ఆదివారాల్లో పంచారామ పుణ్యక్షేత్రాలు దర్శించుకునే భక్తుల కోసం ఉయ్యూరు నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ కేఎస్ఆర్కే ప్రసాద్ గురు వారం తెలిపారు. ఈనెల 18, 19, 25, 26 డిసెంబరు 2, 3, 9, 10 తేదీల్లో ప్రత్యేక బస్సులు రాత్రి 11.45 గంటలకు ఉయ్యూరు బస్టాండ్ నుంచి బయలుదేరి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలో పరమశివుని దర్శించుకుని రాత్రికి ఉయ్యూరు చేరుకుంటాయన్నారు. సూపర్ లగ్జరీ చార్జీ ఒక్కొరికి రూ.1200, అలా్ట్రడీలక్స్ రూ.1115గా నిర్ణయించామని ఒకే గ్రామం నుంచి 35 మంది ఉంటే అక్కడి నుంచే బస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 73828 93468. 89193 66868 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. త్రిలింగ(మహానంది, యాగంటి, శ్రీశైలం)దర్శనం కోసం బస్సులు నడుపుతున్నామని చార్జీ ఒకరికి రూ.1,900గా నిర్ణయించామని తెలిపారు.
Updated Date - 2023-11-10T01:31:47+05:30 IST