ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawada: కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న పవన్.. వారాహి వాహనానికి పూజలు

ABN, First Publish Date - 2023-01-25T10:56:26+05:30

నిన్న కొండగట్టు ధర్మపురిలో వారాహి (Varahi) వాహనానికి పూజలు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. బుధవారం విజయవాడ దుర్గమ్మ (Durgamma) చెంత పూజలు జరిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నిన్న కొండగట్టు ధర్మపురిలో వారాహి (Varahi) వాహనానికి పూజలు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. బుధవారం విజయవాడ దుర్గమ్మ (Durgamma) చెంత పూజలు జరిపించారు. అనంతరం పవన్ ఇంద్రకీలాద్రి (Indrakiladri)కి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా కొండపైకి వారాహి వాహనానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. దీంతో ఘాట్ రోడ్ టోల్ గేట్ దగ్గర అమ్మవారి విగ్రహం ఎదుట వాహనానికి పూజలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ముందుజాగ్రత్తగా ఇంద్రకీలాద్రి దగ్గర పోలీసులు మోహరించారు. అమ్మవారి దర్శనం కోసం పవన్ లోపలికి వెళ్లగా ఆయన వ్యక్తిగత సెక్యూరిటీని లోపలికి అనుమతించలేదు. ముఖ్య నేతలను మాత్రమే అనుమతించారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ అధినేత పవన్ కల్యాణ్‌కు మంచి జరగాలని, భవిష్యత్‌లో జనసేన విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్నారు. కాగా పవన్ రాక సందర్భంగా ఘాట్ రోడ్లు మూసివేశారు.

ఇంద్రకీలాద్రిపై పవన్ కళ్యాణ్ కామెంట్లు..

అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కొండగట్టులో చాలా బాగా దర్శనం జరిగిందని, అమ్మవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలపై ఉంటుందన్నారు. ప్రచార రథానికి పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చానన్నారు. రాష్ట్రంలో జరిగే అరాచకాలు అమ్మవారు చూస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-01-25T10:56:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising