కార్తీక వనభోజనం సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతీక
ABN, First Publish Date - 2023-12-11T02:42:05+05:30
పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీక వనభోజనం సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతీక అని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్లా కృష్ణ
భారత్ బయోటెక్ అధినేత డాక్టర్ ఎల్లా కృష్ణ
కర్నూలు(కల్చరల్), డిసెంబరు 10: పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీక వనభోజనం సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతీక అని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్లా కృష్ణ పేర్కొన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా కేంద్రంలోని కమ్మ కమ్యూనిటీ సభా ప్రాంగణంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుజాతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎల్లా కృష్ణ మాట్లాడుతూ కొవిడ్ మహమ్మారి వ్యాపించి అతలాకుతలం చేస్తున్న సమయంలో భారత్ బయోటెక్ సంస్థ ద్వారా కో వ్యాక్సిన్ను అభివృద్ధి చేసి దేశ విదేశాలకు అందించామన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. అనంతరం ఉసిరి చెట్టు వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వనభోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు.
Updated Date - 2023-12-11T02:42:06+05:30 IST