సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు ఉపాధ్యాయుల మద్దతు
ABN, Publish Date - Dec 18 , 2023 | 11:44 PM
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఏపీసీపీఎస్ఈఏ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పచ్చార్ల సుధాకర్, ఎస్టీయూ కేవీపల్లె మండ ల అధ్యక్షుడు భాస్కరరెడ్డి తెలిపారు.
పీలేరు, డిసెంబరు 18: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఏపీసీపీఎస్ఈఏ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పచ్చార్ల సుధాకర్, ఎస్టీయూ కేవీపల్లె మండ ల అధ్యక్షుడు భాస్కరరెడ్డి తెలిపారు. తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కేవీపల్లె మండలం లోని సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారం ఉపా ధ్యాయ సంఘ నేతలను కలిసి అభ్యర్థించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు, ఔట్-సోర్సింగ్ ఉద్యోగులం దరినీ పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోలేదన్నారు. ఈ నెల 20 నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు మల్లిఖార్జునరెడ్డి, నాగరాజ, వేంపల్లె బాష, రామాంజులు, కుమారి సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 11:44 PM