మహిళల సంక్షేమానికే మహాశక్తి పథకం
ABN, Publish Date - Dec 14 , 2023 | 12:09 AM
రాష్ట్ర మహి ళందరినీ మహారాణులుగా తీర్చిది ద్దేందుకే టీడీపీ అధినేత చంద్రబా బు నాయుడు ‘మహాశక్తి’ పథకం తెచ్చారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తెలిపారు.
పీలేరు, డిసెంబరు 8: రాష్ట్ర మహి ళందరినీ మహారాణులుగా తీర్చిది ద్దేందుకే టీడీపీ అధినేత చంద్రబా బు నాయుడు ‘మహాశక్తి’ పథకం తెచ్చారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తెలిపారు. పీలేరు పట్టణం రైల్వే గేటు వీధి, లక్ష్మీపురం, ఎర్రమరెడ్డిగు ట్ట, డీటీ శ్రీనివాసులు కాంపౌండ్, అజంతా టాకీసు రోడ్డు, పటేల్ వీధి, కలవల సుందరరాజుల వీధి ప్రాంతాల్లో బుధవారం ఆయన జనసేన నాయకులతో కలిసి ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కరపత్రాల ద్వారా పథకాలను మహిళలకు వివరిస్తూ ఇంటిం టి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటపల్లె బాబు, శ్రీకాంత రెడ్డి, అమరనాథరెడ్డి, మల్లెల రెడ్డిబాషా, పురం రామ్మూర్తి, పోలిశెట్టి సురేంద్ర, రెడ్డప్ప రెడ్డి, లక్ష్మీకర, ఖాజాపీర్, సుబ్బయ్య, పిట్టా భాస్కరరెడ్డి, జగడం శ్రీనాథరెడ్డి, చలమయ్య నాయుడు, డాక్టర్ బాషా, దుర్గాప్రసాద్, మహమ్మద్ పీర్, పాల్గొన్నారు.
Updated Date - Dec 14 , 2023 | 12:09 AM