జగన్ది దగుల్బాజీ ప్రభుత్వం
ABN, Publish Date - Dec 26 , 2023 | 03:04 AM
‘సీఎం జగన్ది దగుల్బాజీ ప్రభుత్వం. రానున్న ఎన్నికల్లో ప్రజలే వైసీపీని ఫుట్బాల్ ఆడుతారు’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు.
వైసీపీతో పొత్తు ప్రసక్తే లేదు: సత్యకుమార్
అనంతపురం, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం జగన్ది దగుల్బాజీ ప్రభుత్వం. రానున్న ఎన్నికల్లో ప్రజలే వైసీపీని ఫుట్బాల్ ఆడుతారు’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, పాలకులు గాలి మాటలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. అనంతపురంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైసీపీ ప్రభుత్వం అవినీతి, అప్పుల్లో కూరుకుపోయింది. అలాంటి పార్టీతో పొత్తు ఉండదు. ఇప్పటికింకా పొత్తులపై కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికలకు నాలుగు నెలల సమయం ఉంది. ఆలోపు ఏమైనా జరగొచ్చు. సీఎం జగన్ జీసస్ బోధనల సారాంశాన్ని గ్రహించి, పాలన సాగిస్తే మంచిది’ అని సత్యకుమార్ హితవు పలికారు.
Updated Date - Dec 26 , 2023 | 03:04 AM