ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Palnadu District: టీడీపీ నేతపై వైసీపీ నేత కాల్పులు..తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2023-02-02T07:26:31+05:30

నరసరావుపేట నియోజకవర్గం లో టీడీపీ నేత పై కాల్పులు కలకలం రేపుతున్నాయి. రొంపిచెర్ల మండల టీడీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా: నరసరావుపేట నియోజకవర్గం లో టీడీపీ నేత(TDP Leader) పై కాల్పులు కలకలం రేపుతున్నాయి. రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డి(TDP President Venna Bala Kotireddy) పై వైసీపీ నేత పమ్మి వెంకటేశ్వరరెడ్డి(YCP leader Pammi Venkateswara Reddy) కాల్పులు(firing) జరిపారు. ఇంట్లో నిద్రిస్తున్న బాల కోటి రెడ్డిని బయటకు పిలిచి పిస్టల్‎తో రెండు రౌండ్లు కాల్పులు జరిపి..అనంతరం అక్కడిని నుంచి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో బాల కోటిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే దగ్గర్లో ఉన్న నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా కొద్ది నెలల క్రితమే కోటిరెడ్డిపై వైసీపీ కార్యకర్తలు కత్తులతో దాడి చేయడంతో తృటిలో ప్రాణాపాయ స్థితి నుంచి బాల కోటిరెడ్డి బయటపడ్డాడు. ఇక తాజాగా స్వగ్రామం అలవాలలో కాల్పులతో హత్యాయత్నం మరోసారి కలకలం రేపుతోంది. సమాచారం తెలుసుకున్న టీడీపీ ఇన్ చార్జ్ చదలవాడ అరవింద్ బాబు కోటిరెడ్డిని పరామర్శించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

Updated Date - 2023-02-02T07:40:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising