‘ఫేక్ వార్తలను నమ్మవద్దు’
ABN, Publish Date - Dec 24 , 2023 | 12:47 AM
రౌతులపూడి, డిసెంబరు 23: ఫేక్ వార్తలను నమ్మవద్దు, ఏ పార్టీలో చేరేది త్వరలో చెప్తానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. రౌతులపూడిలో తన చిరకాల మి
రౌతులపూడి, డిసెంబరు 23: ఫేక్ వార్తలను నమ్మవద్దు, ఏ పార్టీలో చేరేది త్వరలో చెప్తానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. రౌతులపూడిలో తన చిరకాల మిత్రులు, మాజీ సర్పంచ్ వాసిరెడ్డి దేవుళ్లు, ఆచంట సుందరరామయ్యను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకర్లు ఆయన్ని జనవరి 2తరువాత వైసీపీలో చేరుతున్నట్టు వాస్తున్న వార్తలపై ప్రశ్నించగా ఏపార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తాన న్నారు. కార్యక్రమంలో కేదారశేట్టి నాగేశ్వరరావు, అంకంరెడ్డి సతీష్కుమార్, పందుల తాతారావు, చిట్రా అర్జునరావు, పోలుపర్తి తాతాజీ, సర్నం శ్రీను తదితరులున్నారు.
Updated Date - Dec 24 , 2023 | 12:47 AM