డీఆర్డీఏ పీడీగా ఎన్వీవీఎస్ మూర్తి
ABN, Publish Date - Dec 26 , 2023 | 01:27 AM
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులుగా ఎన్వీవీఎస్ మూర్తి పద వీ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ మాధవీలతను మర్యాద పూర్వకంగా రిపోర్టు చేశారు. 2007లో గ్రూప్-1 అధికారిగా ఎంపికై తొలిసారిగా పూర్వపు తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఎంపీడీవోగా ప్రభుత్వ సర్వీస్లో జాయిన్ అయ్యా రు.
రాజమహేంద్రవరంరూరల్, డిసెంబరు 25: జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులుగా ఎన్వీవీఎస్ మూర్తి పద వీ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ మాధవీలతను మర్యాద పూర్వకంగా రిపోర్టు చేశారు. 2007లో గ్రూప్-1 అధికారిగా ఎంపికై తొలిసారిగా పూర్వపు తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఎంపీడీవోగా ప్రభుత్వ సర్వీస్లో జాయిన్ అయ్యా రు. కడియం, రాయవరం, రాజానగరం ఎంపీడీవోగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కాకినాడ జడ్పీ కార్యాలయం పరిపాలనాధికారిగా 2022 పనిచేస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన పదోన్నతుల్లో భాగంగా డివిజనల్ అభివృద్ధి అధికారిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులుగా (డీఆర్డీఏ పీడీ) పదవీ బాధ్యతలు చేపట్టారు.
Updated Date - Dec 26 , 2023 | 01:27 AM